Friday, May 3, 2024

AP | మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని మార్చిన వైసీపీ

మచిలీపట్నం ఎంపీగా ఇంచార్జిగా సింహాద్రి చంద్రశేఖర్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ప్రకటించారు. గురువారం సాయంత్రం (మార్చి 7) మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. సీఎం జగన్ ఆదేశాల మేరకు సింహాద్రి చంద్రశేఖర్‌ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ముందుగా అవనిగడ్డ అసెంబ్లీ ఇంచార్జిగా సింహాద్రి చంద్రశేఖర్‌ను వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఉన్న సింహాద్రి రమేష్ మళ్లీ అవనిగడ్డకు బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement