Friday, May 3, 2024

AP | రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే : ఈసీ

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచారంలో హెలికాప్టర్లు, వాహనాల వినియోగం, సభలు, సమావేశాలు, ఊరేగింపుల నిర్వహణకు ముందుగా తీసుకోవాల్సిన అనుమతుల వ్యవహారంపై సూచనలు చేశారు.

ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చుపై సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియతో పాటు కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు పాటించాలన్నారు.

మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి సందేహాలు, గందరగోళం ఉండవని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాజకీయ పార్టీలు పలు అంశాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లాయి. ఎన్నికల విధుల్లో వలంటీర్ల జోక్యం, కొందరు ఉద్యోగులు తమ పరిధికి మించి వ్యవహరిస్తున్నారని టీడీపీ, సీపీఎం పార్టీలు ఫిర్యాదు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement