Sunday, May 12, 2024

Breaking: ఇంగ్లండ్​ను కట్టడి చేసిన భారత్​.. 259 పరుగులకే ఆలౌట్​!

ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో కీలక వన్డేలో ఇంగ్లండ్​ గౌరవప్రదమైన 259 పరుగులు చేసింది. అయితే.. పూర్తిస్థాయి ఓవర్లు ఆడకుండానే అన్ని వికెట్లు పోగొట్టుకుంది. 45.5 ఓవర్లకే ఆలౌట్​ అయ్యింది ఆతిథ్య జట్టు. 46వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఓవర్టాన్ కొట్టిన బంతిని లాంగాఫ్‌లో ఉన్న సిరాజ్ ‘అంచనా వేయలేకపోయాడు. దీంతో అతని చేతుల్లో పడి గాల్లోకి లేచిన బంతి బౌండరీ అవతల పడింది. ఇక.. ఆ తర్వాత బాల్ డాట్ కాగా.. ఇంకో బాల్​ని లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదేందుకు ఓవర్టాన్ యత్నించాడు. ఈసారి అక్కడ ఫీల్డింగ్‌కు వచ్చిన కోహ్లీ ఎలాంటి పొరపాటు చెయ్యకుండా క్యాచ్ పట్టేశాడు. దీంతో ఓవర్టాన్ (32) ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టాప్లే (0)ను చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

కాగా, కార్సే సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్‌కు వచ్చిన టాప్లే.. తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఇక్కడితో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తమ్మీద 45.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో వన్డేలో భారత్‌ను 146 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో అట్లాంటి ఆటతీరునే ప్రదర్శించాలని గట్టిగా ట్రైచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక.. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4, చాహల్ 3 వికెట్లతో భేష్​ అనిపించుకున్నారు. సిరాజ్ 2 వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement