Sunday, April 28, 2024

ఇండియా- లీచెస్టర్‌ వార్మప్‌ మ్యాచ్.. టీమిండియా బౌలర్లు తిప్పేశారు!

లీచెస్టర్‌ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు టీమిండియా పైచేయి సాధించింది. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 189 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కు 80 పరుగులు లీడ్‌ దొరికింది.


తొలి రోజు టాస్‌ నెగ్గి టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుని 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(25), మాజీ సారథి విరాట్‌ కోహ్లీ(33) మరోసారి విఫలమయ్యారు. శిఖర్‌ భరత్‌ 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చివరలో ఉమేష్‌ యాదవ్‌ మెరుపులు కురిపించాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement