Friday, May 3, 2024

హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌కు వెయ్యి రూపాయల ధోతి, షర్టు..

టోక్యో ఒలింపిక్స్ లో హాకీ కాంస్య పతకం గెలుచుకున్న టీమిండియా పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. టీమ్ సభ్యులకు ఆయ రాష్ట్రాల ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. ఇక టీమిండియా మెడల్ సాధించడంలో గోల్ కీపర్ రవీంద్రన్‌ శ్రీజేశ్‌ పాత్ర అత్యంత కీలకం. ఎన్నో రివార్డులు వరిస్తున్నాయి. శ్రీజేశ్‌కు మళయాళీ వ్యాపారవేత్త ఒకరు భారీ నగదు కానుక అందించనున్నారు. గల్ఫ్‌లో నివాసం ఉంటున్న వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షంషీర్‌ వయలిల్‌ తన తరఫు నుంచి కేరళకు చెందిన శ్రీజేశ్‌కు రూ. కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  మరోవైపు.. పీఆర్‌ శ్రీజేశ్‌కు కేరళ చేనేత శాఖ వెయ్యి రూపాయల విలువ చేసే ధోతి, షర్టు రివార్డుగా ప్రకటించినట్లు మలయాళ వార్తా సంస్థ జన్మభూమి వెల్లడించింది.

ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఒలింపియన్‌కు ఇంతటి ఘన సన్మానమా.. భేష్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. శ్రీజేశ్‌ పట్ల అభిమానాన్ని డబ్బుతో పోల్చి చూడవద్దని హితవు పలుకుతున్నారు. కాగా కేరళకు చెందిన శ్రీజేశ్‌ భారత పురుషుల హాకీ జట్టులో గోల్‌ కీపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో గెలుపొంది టీమిండియా 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.  

ఇది కూడా చదవండి: కాణిపాకంలో ప్రమాణం చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement