Thursday, May 2, 2024

IND vs ENG, 4th Test : జైస్వాల్ హాఫ్ సెంచరీ… 112కు మూడు వికెట్లు కోల్పోయిన భారత్..

రాంచీ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కొనసాగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ జట్టు 112 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి ఔట్ కాగా, శుభమాన్ గిల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. రజత్ పటిదార్ 17 పరుగుల చేసి ఔటయ్యాడు.

భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జైస్వాల్ 89 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్సర్ తో 50 పరుగులు పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ సమయానికి భారత్ జట్టు 32 ఓవర్లలో 105 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement