Tuesday, April 30, 2024

Ind vs Eng, 2nd Test : ముగిసిన రెండోరోజు ఆట.. భారత్ స్కోరు 28/0

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. భారత్ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15 పరుగులు, రోహిత్ శర్మ 13 పరుగులు చేశారు.

ఈ టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆతర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement