Thursday, May 2, 2024

Ind vs Eng 1st Test : రెండో రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ 421/7..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 421 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.

భారత్ బ్యాట్స్ మెన్లు కేఎల్ రాహుల్ 86 పరుగులు, యశస్వి జైస్వాల్ 80 పరుగులు, శ్రీకర్ భరత్ 41 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేసి ఔట్ కాగా.. రవీంద్ర జడేజా 81 పరుగులతో, అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేయడంతో 175 పరుగుల లీడ్ లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement