Saturday, May 4, 2024

Ind-Sa ODI | టీమిండియాకు కొత్త కోచ్.. ద్రావిడ్‌కు విశ్రాంతి

ప్రస్తుతం సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త్ టీ20 సిరీస్ ముగించుకుంది. ఇక, రేపటి నుంచి (డిసెంబర్ 17) టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇప్పుడు అందరి దృష్టి ఈ సిరీస్‌పైనే ఉంది. అయితే, ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు వన్డే సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు.

ద్రవిడ్ స్థానంలో సౌరాష్ట్ర మాజీ ఆటగాడు సితాన్షు కోటక్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, వన్డే సిరీస్‌లో అజయ్ రాత్రా, రాజీబ్ దత్తా ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. వీరంతా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సిబ్బంది. ఈసారి వీరికి టీమ్ ఇండియా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement