Tuesday, May 7, 2024

Breaking: జింబాబ్వేపై గ్రేట్ విక్ట‌రీ.. 3.0తో వ‌న్డే సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా..

జింబాబ్వేతో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ని టీమిండియా కైవ‌సం చేసుకుంది. మూడు వ‌న్డేల్లోనూ విజ‌యం సాధించి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింది. ఇవ్వాల (సోమ‌వారం) జ‌రిగిన మూడో వ‌న్డేలోనూ భార‌త క్రికెట‌ర్లు బ్యాటింగ్‌, బౌలింగ్ ప‌రంగా అద్భుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 289 ప‌రుగులు చేసింది. కాగా, రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జ‌ట్టు 276 ప‌రుగుల‌కు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో ఇండియా 13 ప‌రుగుల విజ‌యాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement