Thursday, May 2, 2024

Big Breaking | 35 ఓవర్లలోనే ముగించేశారుగా.. ఆఫ్గాన్​పై భారత్​ ఘన విజయం!

వరల్డ్​ కప్​లో భాగంగా ఇవ్వాల (బుధవారం) భారత్​, ఆఫ్గాన్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన 9వ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ఆఫ్గాన్​ జట్టు 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కాగా, 273 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు కెప్టెన్​ రోహిత్​ శర్మ, ఇషాన్​ కిషన్​ శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్​ 84 బంతుల్లో (131) పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆ తర్వాత ఇషాన్​ కిషన్​ (47) పరుగుల వద్ద పెవిలియన్​ చేరాడు. అప్పటికే పటిష్టమైన స్థితిలో భారత్​ ఉంది. ఆ తర్వాత విరాట్​ కోహ్లీ 55, శ్రేయస్​ అయ్యర్​ 25 కలిసి ఇన్నింగ్స్​ను ముగించారు. నాటౌట్​గా నిలిచారు. టీమిండియా 8 వికెట్ల ఘన విజయం సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. ఈ క్రమంలో ఆఫ్గాన్​ బౌలర్​ రశీద్​ ఖాన్​ రోహిత్​, ఇషాన్​ వికెట్లను పడగొట్టడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement