Sunday, April 28, 2024

IPL | చెలరేగిన చెన్నై.. 8 పరుగుల తేడాతో విజయం

బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్​ మ్యాచ్​లో ఇవ్వాల (సోమవారం) రాత్రి చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. తొలుత టాస్​ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్​కు దిగిన ధోనీ సేన చెలరేగి ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226  పరుగులు చేసింది.

ఇందులో.. కాన్వే (83), రహానే (37), శివం దూబే (52) పరుగులతో అభిమానులకు అలరించారు. సిక్స్​లు, ఫోర్లతో మోత మోగించారు. దీంతో చెన్నై పటిష్టమైన పరుగుల చేయగలిగింది.. ఇక.. సిరాజ్​, పార్నెల్​, విజయ్​కుమార్​, హసరంగా, హర్షల్​ పటేల్​కు తలా ఒక వికెట్​ దక్కింది..

కాగా, బెంగళూరు టార్గెట్​ 237 ఉండగా.. బ్యాటింగ్​కు దిగిన కోహ్లీ (6) తొలి ఓవర్​లోనే అవుటయ్యాడు.  ఆ తర్వాత డూప్లీసెస్​ (62), మ్యాక్స్​వెల్​ (76) కలిసి వీర బాదుడు బాదారు. ఓ క్రమంలో బెంగళూరు ఈజీగా గెలుస్తుందనే ధీమా బెంగళూరు అభిమానుల్లో వ్యక్తం అయ్యింది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరి భాగస్వామ్యం బ్రేక్​ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. కాస్త దినేష్​ కార్తీక్​ పర్వాలేదు అనిపించినా.. అతని అవుట్​ తర్వాత అంతలా ఆదుకునే వారు లేక చతికిల పడింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎనిమిది పరుగుల తేడాతే చెన్నైపై బెంగళూరు ఓటమి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement