Saturday, May 18, 2024

INDvsENG | రెండో టెస్ట్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ !

విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా రేప‌ట‌నుంచి భార‌త్- ఇంగ్లాండ్ మద్య రెండో టెస్ట్ మ్యాచ్‌ జ‌ర‌గ‌నుంది. కాగా, ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందే త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది ఇంగ్లాండ్ జట్టు. ఉప్ప‌ల్‌లో మ్యాచ్‌లో అయిన గాయం కార‌ణంగా సీనియ‌ర్ స్పిన్న‌ర్ జాక్ లీచ్ విశాఖ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో యువ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ అరంగ్రేటం చేయ‌నున్నాడు.

ఇక మొద‌టి టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయ‌ని పేస‌ర్ మార్క్‌వుడ్ ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది. అత‌డి స్థానంలో వెట‌ర‌న్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్‌కు స్థానం క‌ల్పించింది. ఈ రెండు మార్పులు మిన‌హా ఉప్పల్‌లో ఆడిన జ‌ట్టుతోనే ఇంగ్లాండ్ విశాఖ‌ మ్యాచులో ఆడ‌నుంది.

రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ఇదే..

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement