Sunday, April 28, 2024

Big Breaking | ఫైనల్స్​కు చేరిన ధోనీ సేన.. గుజరాత్​పై గ్రాండ్​ విక్టరీ!

క్వాలిఫయర్​–1లో భాగంగా ఇవ్వాల (మంగళవారం) చెన్నై చపాక్​ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ గ్రాండ్​ విక్టరీ సాధించింది. గుజరాత్​పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.

అయితే.. 173 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన గుజరాత్​ జట్టు.. ఆది నుంచి ప్రొటెక్టివ్​గా ఆడుతూ వచ్చింది. అయితే.. మిడ్​ ఓవర్లలో వృద్ధిమాన్​ సాహా (12) పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్​ పాండ్యా (8) పరుగులకే పెవిలియన్​ చేరాడు. అయితే.. స్కోరు బోర్డుని మెల్ల మెల్లగా కదిలించడంతోపాటు.. వీలైనప్పుడల్లా ఫోర్లు, సిక్స్​లతో ఆకట్టుకున్నాడు శుభ్​మన్​ గిల్​..

ఇక.. గిల్ (42) అవుట్​ కావడంతో గుజరాత్​ జట్టు కష్టాల్లో పడింది. అయినా.. రశీద్​ ఖాన్​ (30) , విజయ్​ శంకర్​ (14), ఆదుకునే ప్రయత్నం చేసినా వారి జోడీని పతిరానా బౌలింగ్​లో గైక్వాడ్​ క్యాచ్​పట్టి విడగొట్టాడు. దీంతో టెయిలెండర్లు బరిలో దిగాల్సి వచ్చింది. ఆఖరికి అన్ని వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసి, 15 పరుగుల తేడాతో గుజరాత్​ ఓటమి చెందింది.. ఇక.. రేపు జరిగే ఎలిమినేటర్​ రౌండ్​లో (ముంబయి–లక్నో) గెలిచిన వారితో మళ్లీ గుజరాత్​ ఆడాల్సి ఉంటుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement