Wednesday, May 22, 2024

IPL 2024 | సోష‌ల్ మీడియాలో ధోనీ పోస్ట్ వైరల్..

మరో రెండు వారాల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ప్రారంభం కానుంది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే సీజన్‌ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు కొత్త చర్చకు తెరలేపింది.

వాస్తవంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. ఇవ్వాల (సోమవారం) ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్టు చేశాడు. అందులో “కొత్త సీజన్‌.. కొత్త రోల్‌ కోసం ఎదురుచూస్తున్నా” అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుతో సీఎస్కే ఫ్యాన్స్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ ఫ్యాన్స్‌.. రకరకాలుగా ఊహించుకుంటున్నారు. కొందరేమో ఈ ఏడాది మెంటార్‌ కమ్ కోచ్‌గా ధోనీ కన్పించబోతున్నాడని పేర్కొంటున్నారు. మరి కొందరేమో మహీ కెప్టెన్సీ వదిలేసి కేవలం ఆటగాడిగా మాత్రమే ఉంటాడని విశ్లేషించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement