చెన్నై – భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ అయిదు వికెట్లు కోల్పొయింది.. జడేజా ఒకే ఓవర్ లో లబు షేన్, అలెక్స్ క్యారీలను పెవిలియన్ కు పంపాడు ….. లబుషేన్ 27 పరుగులు చేయగా, క్యారీ డకౌట్ గా వెనుతిరిగాడు .అంతకు ముందు మూడో వికెట్ స్టీవ్ స్మిత్ రూపంలో కోల్పొయింది.. జడేజా బౌలింగ్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. స్మిత్ 46 పరుగులు చేశాడు .. అలాగే రెండో వికెట్ గా 41 పరుగులు చేసిన వార్నర్ ను కులదీప్ యాదవ్ ఔట్ చేశాడు.. ఆసీస్ 30 ఓవర్లు పూర్తి అయ్యే సరికి అయిదు వికెట్లు కోల్పొయి 119 పరుగులు చేసింది.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఓవర్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ మార్ష్ ను సున్నా పరుగులకే బూమ్రా పెవిలియన్ కు పంపాడు.