Saturday, April 27, 2024

వాంఖ‌డే టెన్షన్..మరో ముగ్గురికి కరోనా..

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముంద కరోనా తెగ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో పలువురికి కరోనా సోకగా ఐపీఎల్ నిర్వహణపై ఊహగానాలు నెలకొన్నాయి. అయితే మొత్తానికి బీసీీసీఐ ప్రకటనతో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయిన్న క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో మ‌రో ముగ్గురికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. ఇద్ద‌రు మైదాన సిబ్బంది, ఒక ప్లంబ‌ర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ముంబైలో షెడ్యూల్ ప్ర‌కార‌మే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన రోజే మ‌రో ముగ్గురు క‌రోనా బారిన ప‌డ‌టం గ‌మ‌నార్హం. టోర్నీని స‌జావుగా న‌డిపే ఉద్దేశంతో మైదాన సిబ్బంది స్టేడియంలోనే ఉంటున్నార‌ని, ప్ర‌యాణాలు చేయ‌డం లేద‌ని ఎంసీఏ స్పష్టం చేసింది. గ‌తంలో ఇదే స్టేడియంలో ప‌ని చేసే ప‌ది మంది సిబ్బందికి కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. మ‌రింత మందికి క‌రోనా సోక‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ముంబై ఐపీఎల్ మ్యాచ్‌లు ముగిసే వ‌ర‌కూ మైదాన సిబ్బంది మొత్తం స్టేడియంలోని క్ల‌బ్ హౌజ్‌లోనే ఉంటున్న‌ట్లు ఎంసీఏ అధికారి ఒక‌రు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement