Sunday, April 28, 2024

IPL | బట్లర్​ జోరు, రాజస్థాన్​ బెటర్​ స్కోరు.. చెన్నై టార్గెట్​ ఎంతంటే?

చెన్నై, రాజస్థాన్​ జట్ల మధ్య ఇవ్వాల (బుధవారం) చెన్నైలో జరుగుతున్న మ్యాచ్​లో జోస్​ బట్లర్​ జోరు పెంచాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్​ ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇందులో బట్లర్​ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక.. జైశ్వాల్​ (10), పడిక్కల్​ (38), సంజు శాంసన్​ (0), అశ్విన్​ (30), ధ్రువ్​ (4), హోల్డర్​ (0), జంఫా (1) పరుగులు చేయగా.. హెట్మేయర్​ 30 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

ఇక చెన్నై బౌలర్లలో.. ఆకాశ్​ సింగ్​, దేశ్​పాండే, జడేజా తలా రెండేసి వికెట్లు తీశారు. మొయిన్​ అలీ 1 వికెట్​ పడగొట్టాడు. కాగా, 176 పరుగుల టార్గెట్​తో చెన్నై బరిలోకి దిగాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement