Wednesday, May 15, 2024

Sports | వింబుల్డన్‌రెండో రౌండ్‌లోకి బోపన్న జోడీ

వింబుల్డన్‌ టోర్నీలో భారత టెన్నీస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న- అతని సహ క్రీడాకారుడు ఆస్ట్రేలియన్‌ పార్టనర్‌ మాథ్యూ ఎడ్‌బెడెన్‌ జోడీ అద్భుతంగా రాణించి, రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి నాడిక్కడ జరిగిన డబుల్స్‌ విభాగంలో అర్జెంటీనా జోడీ గుయిల్లెర్మో డురన్‌- టోమస్‌ ఇచ్‌వెర్రీతో జరిగిన హోరాహోరీ పోరులో బోపన్న జోడీ విజయం సాధించింది. 2గంటల 12 నిముషాల పాటు సాగిన పోరులో 6-2, 6-7, 7-6 తేడాతో అర్జెంటీనా జోడీపై గెలుపొందింది.

43ఏళ్ల బోపన్న- ఎడ్‌బెన్‌ జోడీ ఈ ఏడాది ఆరంభంలో ఏటీపీ టూర్‌ టూ డబుల్‌ టైటిల్స్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆదివారంనాడు సెకండ్‌ రౌండ్‌లో బ్రిటీష్‌ జోడీ జాకబ్‌ ఫియర్నెలె- జొహన్నస్‌తో బోపన జోడీ తలపడనుంది. మరో భారత టెన్నీస్‌ క్రీడాకారుడు యుకి భాంబ్రి- సాకేత్‌ మైనేని జోడీ అలెజాండ్రో డేవిడోవిచ్‌ (స్పెయిన్‌)- ఆండ్రియన్‌ మన్నారినో (ఫ్రాన్స్‌)తో తలపడింది. అలాగే మరో భారత జోడీ జీవన్‌ నెదుంచెజియాన్‌- ఎన్‌.శ్రీరామ్‌ బాలాజీ సెకండ్‌ సీడ్స్‌ ఆస్టిన్‌ క్రాజిచెక్‌(యూఎస్‌ఏ)- ఇవాన్‌ డొడిగ్‌తో తలపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement