Thursday, May 9, 2024

IPL 2024 | ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ భారీ ఏర్పాట్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి సమయం ఆసన్నమైంది. రేపు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత రిచ్చెస్ట్ లీగ్‌గా పేరుగాంచిన ఈ టోర్నీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. గతేడాదిలాగే.. ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రేపు (మార్చి 22న) సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ హాజరుకానున్నారు.

ఇక ప్రారంభ వేడుకలు ముగిసిన తరువాత.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నుంచి మధ్యాహ్నం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement