Friday, May 17, 2024

AUS vs PAK: విధ్వంసం సృష్టించిన ఆసీస్ బ్యాటర్లు … పాక్ భారీ టార్గెట్ 368 పరుగులు

పాకిస్తాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లు సెంచరీలతో కదం తొక్కారు. విధ్వంసం సృష్టించారు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 9వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు చేసింది.

ఆసీస్ బ్యాట్స్ మెన్లు డేవిడ్ వార్నర్ 163 పరుగులు, మిట్చెల్ మార్ష్ 121పరుగులు, స్టోయినిస్ 21 పరుగులు చేశారు. పాకిస్థాన్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 368 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement