Saturday, May 4, 2024

Ashwin: వందో టెస్ట్ లో అశ్వీన్.. టీమ్ ఇండియా ‘గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌’

భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కెరీర్‌లో మ‌రో మైలురాయికి చేరుకున్నాడు. ఈ మ‌ధ్యే 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్ వందో టెస్టు మ్యాచ్ ఆడ‌తున్నాడు. ఈ సంద‌ర్బంగా ధ‌ర్మ‌శాల‌లో హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్, భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు అశ్విన్‌ను ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.

- Advertisement -

కోచ్ ద్ర‌విడ్ వందో టెస్టు క్యాప్‌ను అశ్విన్‌కు బ‌హూక‌రించాడు. అనంత‌రం అత‌డు భార్య ప్రీతి, ఇద్ద‌రు కూతుళ్లతో క‌లిసి ఫొటోలు దిగాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అశ్విన్ మైదానంలో అడుగుపెట్టేట‌ప్పుడు టీమిండియా ఆటగాళ్లు ఇరువైపులా నిల‌బ‌డి ‘గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌’తో గౌర‌వించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement