Tuesday, April 30, 2024

ముంబయి ఇండియన్స్ తుది జట్టులో.. అర్జున్ టెండూల్కర్

గ‌త ఏడాది గోవా జ‌ట్టు త‌ర‌పున రంజీల్లో అడుగుపెట్టాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్..కాగా అర్జున్ ఆడిన తొలిమ్యాచ్ లో సెంచరీ కొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అరంగేట్రం చేస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ప్రణాళికల్లో చాలాకాలంగా అర్జున్ టెండూల్కర్ భాగంగా ఉన్నాడు. 2021 వేలంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇటీవల మినీ వేలంలోనూ అతడిని దక్కించుకుంది. నేడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆడే ముంబయి ఇండియన్స్ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్ కు స్థానం లభించింది. అర్జున్… హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఎంఐ క్యాప్ అందుకున్నాడు. ప్రధానంగా ఎడమచేతివాటం ఫాస్ట బౌలర్ అయిన అర్జున్… బ్యాటింగ్ లో భారీ షాట్లు కొట్టడంలో దిట్ట. దాంతో, నేటి మ్యాచ్ లో అందరి కళ్లు సచిన్ తనయుడిపైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement