Saturday, April 27, 2024

Anshu : రీ ఎంట్రీ కోసం మ‌న్మ‌థుడు హీరోయిన్ …

సరిగ్గా 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో అన్షు హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే నాగార్జున వంటి స్టార్‌ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అన్షు. అందమైన రూపం, అమాయకమైన నటన, మత్తెక్కించే చూపులతో, లంగా ఓణిలో బాపు బొమ్మలా కనిపించి ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత వెంటనే ప్రభాస్‌ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించింది.

తెలుగులో అన్షు హీరోయిన్‌గా చేసింది ఈ రెండు సినిమాల్లోనే. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
ఇక అన్షు ఆఖరి, ఏకైక తమిళ సినిమా ‘జై’. ఆ తర్వాత ఆమె మరే సినిమాలో కనిపించ‌లేదు. ఇక సినిమాల్లో నటించడానికి లండన్ నుంచి ఇండియాకు వచ్చిన అన్షు.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. లండన్ వ్యక్తినే పెళ్లాడి మళ్లీ అక్కడే సెటిల్‌ అయ్యింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సచిన్ సగ్గర్‌ను వివాహం చేసుకుంది అన్షు. ఆమె స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో.. వివాహం తర్వాత లండన్‌లోనే గార్మెంట్స్ బిజినెస్‌ ప్రారంభించింది.

సినిమాలకు దూరం అయినప్పటికి.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు అన్షు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.తాజాగా అన్షు ఒక సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 20 ఏళ్ల క్రితం‘మన్మథుడు’ సినిమాలో నాగార్జునతో తాను చేసిన ఒక మళ్లీ ఇప్పుడు రీక్రియేట్ చేసింది అన్షు. ఆ సినిమాలో నాగార్జునతో తాను చెప్పిన డైలాగులను ఇప్పుడు కూడా అవే ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పి.. మరోసారి ఫిదా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 20 ఏళ్ల తరవాత కూడా అన్షు అంతే అందంగా ఉన్నారంటూ పొగుడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement