Saturday, April 27, 2024

రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రైతుల కోసం 23 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రూ. 2 కోట్ల విలువైన ఈ ట్రాక్టర్లను 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఎమ్మెల్యే కాకముందు నుంచీ ఆయన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు.

దివంగత వైఎస్ మాదిరిగా తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పారు. మరోవైపు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేత నారా లోకే‌ష్‌పై విమర్శలు గుప్పించారు. రాబందులా శవాల కోసం లోకేశ్ ఎదురు చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ లోకేష్ వాలిపోతున్నాడని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.

ఈ వార్త కూడా చదవండి: నారా లోకేష్ పెద్ద మనసు.. 8 ఏళ్ల బాలుడికి సాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement