Sunday, April 28, 2024

వివేక హ‌త్య‌కేసు: కొనసాగుతోన్న సీబీఐ విచారణ..

వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ రోజు పులివెందులకు చెందిన ఉమాశంకర్, భరత్, రసూల్, మున్నీసాను విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు వారిని ప్ర‌శ్నిస్తున్నారు. ఉమాశంకర్, భరత్ ను ఇప్ప‌టికే ప‌లుసార్లు అధికారులు విచారించ‌గా, రసూల్, మున్నీసా మాత్రం మొదటిసారిగా సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. వివేక‌ హ‌త్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్ర‌శ్నిస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా మరికొంత మంది అనుమానితులను అధికారులు విచారించే అవకాశం ఉంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్ప‌టికే అనేక మంది అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు.

ఇది కూడా చదవండి: లార్డ్స్ టెస్ట్: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల ఆధిక్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement