Saturday, May 4, 2024

పాతబస్తీలో బీబీకా ఆలంను సందర్శించిన షర్మిల..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హైదరాబాద్ పాతబస్తీలో ఈరోజు పర్యటించారు. రేపు మొహర్రం సందర్భంగా పాతబస్తీ డబీర్ పూర్ లో ఉన్న బీబీకా ఆలంను ఆమె సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ముస్లిం సోదరులు, సోదరీమణులతో కలిసి చాదర్ సమర్పించడం జరిగిందని ఆమె ట్వీట్ చేశారు. ఇమామ్ హజరత్ హుస్సేన్ ప్రజల హక్కుల కోసం పోరాడారని… అదే విధంగా తెలంగాణలో హక్కుల కోసం తాము పోరాడతామని చెప్పారు.

ఇది కూడా చదవండి: అలర్ట్: డెంగీ డెంజర్ బెల్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement