Wednesday, May 1, 2024

అలర్ట్: డెంగీ డెంజర్ బెల్స్..

తెలంగాణ విషజ్వరాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జ్వరాలతో ఆస్పత్రి వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెగిపోయింది. గత పది రోజుల నుంచి వాతవారణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు వైరల్ ఫీవర్ భారీన పడుతున్నారు. దోమల బెడద కూడా తోడవడటంతో డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సాధారణ రోజుల్లో వచ్చే రోగలకంటే రెండు మూడు రెట్లు అధికంగా రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు.. ప్రభుత్వ దవాఖానాలే కాదు.. ప్రయివేట్ దవాఖానాల పరిస్థితి కూడా అలాగే ఉంది.. హస్పిటల్ ఏదైనా సరే రోగుల మాత్రం పెరిగి పోతున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితని బట్టి ఓపీ ట్రీట్ మెంట్ కొందరికి, తీవ్రతను బట్టి హస్పిటల్ లో మరికొందరిని చేర్చుకుని ట్రీట్ చేస్తున్నారు… అయితే ప్రయివేట్ ఆస్పత్రిలో మాత్రం డెంగీ లక్షణాలు కనిపిస్తే చాలూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం.

హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవతున్నాయి. హైదరాబాద్‌లో 447, ఖమ్మం లో 134 కేసులు, రంగారెడ్డి లో 110 కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే 12 వందల కేసులు నమోదయ్యాయి. రెండేళ్ళ క్రితం ఈ సారి సైతం డెంగీ డేంజరస్ గా విజృంభిస్తోంది.. హైదరాబాద్‌లో ఫీవర్ ఆస్పత్రి, నిలోఫర్, గాంధీ, ఉస్మానియాల్లోని ఓపీలు రోగుల క్యూ లైన్లతో నిండిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైన మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

Advertisement

తాజా వార్తలు

Advertisement