Saturday, April 20, 2024

ఏపీలో మళ్లీ 1500 దాటిన పాజిటివ్ కేసులు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త పాజిటివ్ కేసులు మరోసారి 15 వందల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 67,716 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,501 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,697 మంది కోలుకోగా… 10 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,98,603కి చేరింది. మొత్తం 19,69,169 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,696 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 315 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 21, చిత్తూరు జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 141, కడప జిల్లాలో 49, కృష్ణాజిల్లాలో 147, కర్నూలు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 242, ప్రకాశం జిల్లాలో 107, శ్రీకాకుళం జిల్లాలో 30, విశాఖపట్నం జిల్లాలో 123, పశ్చిమగోదావరి జిల్లాలో 150 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

ఇది కూడా చదవండిః CORONA UPDATE: 149 రోజుల క‌నిష్టస్థాయికి యాక్టివ్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement