Tuesday, May 14, 2024

కొత్త ఉద్యోగాలు కాదు.. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు: షర్మిల

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుందని ఆమె ఆరోపించారు. ‘డీఎస్సీపై ఆశల్లేవ్’ పేరిట ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రభావంతో కొత్త టీచర్ పోస్టులపై ఆశలు లేకుండాపోతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు.

తెలంగాణలో బీఈడీ అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గిపోనుందని షర్మిల జోస్యం చెప్పారు. హేతుబద్ధీకరణతో 13 వేల పోస్టులను సర్దుబాటు చేస్తున్నారని, అవసరానికి మించి ఉపాధ్యాయుల సంఖ్య ఉంటుండడంతో కొత్త నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ విషయాలను షర్మిల ప్రస్తావించారు. వైఎస్ఆర్ తన ఐదేండ్ల పాలనలో 2004, 2006, 2008లో డీఎస్సీ వేసి లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశారని గుర్తుచేశారు. 2008లో జంబో డీఎస్సీ వేసి ఒకేసారి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారని… నేడు రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటుంటే ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతుండు కేసీఆర్ దొర అని షర్మిల విమర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై పోలీసులకు ఫిర్యాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement