Monday, April 29, 2024

రేవంత్‌రెడ్డికి షాక్.. సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రేవంత్‌తో పాటు ఈ కేసుకు సంబంధించి టీఆర్‌ఎప్‌ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేంకృష్ణలకు కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్ షీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. సమన్లు జారీ చేసిన ఈడీ కేసులను విచారణ జరిపింది. ఈ సందర్భంగా వారికి సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబరు 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా 2015 ఏడాది నుంచి ఓటుకు నోటు కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి ఏ1 ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ వార్త కూడా చదవండి: స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement