Saturday, May 4, 2024

వీడియో: నడిరోడ్డుపై విద్యార్థి సంఘం నేత దారుణహత్య

పంజాబ్‌లోని మొహాలీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. న‌డిరోడ్డుపై అకాలీద‌ళ్ విద్యార్థి సంఘం నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. ఈ ఘ‌ట‌న‌పై మొహాలీ ఎస్పీ స‌తీంద‌ర్ సింగ్ స్పందించారు. మ‌తౌర్ మార్కెట్‌కు వ‌చ్చిన విక్కీ కారులో తిరుగు పయ‌నం అవుతుండ‌గా దుండ‌గులు అతడిపై కాల్పులు జ‌రిపారు.

అప్ర‌మ‌త్త‌మైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. అర కిలోమీట‌ర్ వ‌ర‌కు విక్కీ ప‌రుగులు తీశాడు. ఈ క్ర‌మంలో విక్కీని వెంటాడి కాల్పులు జ‌రిపి హ‌త్య చేశారు. కాగా విద్యార్థి నేతను న‌లుగురు దుండ‌గులు వేటాడి చంపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జ‌రిపారు అని మొహాలీ ఎస్పీ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని ఆయన స్పష్టం చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement