Thursday, May 2, 2024

యు పి వారియర్స్ టార్గెట్ 170 పరుగులు… 19/2

ముంబై – మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ మూడో మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్ జట్టు యూపీ వారియ‌ర్స్‌పై 6 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. హ‌ర్లీన్ డియోల్ (46) రాణించ‌డంతో ఆ జ‌ట్టు అంత స్కోర్ చేయ‌గ‌లిగింది. ఓపెన‌ర్లు స‌బ్బినేని మేఘ‌న (24), సోఫియా డంక్లే (13) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆషే గార్డ్‌న‌ర్ (25), ద‌య‌లాన్ మేహ‌ల‌త (21 నాటౌట్‌) చివ‌ర్లో ధాటిగా ఆడారు. హేమ‌ల‌త సిక్స‌ర్లు, ఫోర్ల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించింది. యూపీ వారియ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఎక్లెస్టోన్ దీప్తి శ‌ర్మ త‌లా రెండు వికెట్లు తీశారు. అంజ‌లి స‌ర్వాని, త‌హిలా మెక్‌గ్రాత్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది. 170 పరుగుల విజయ లక్ష్యాన్ని బ్యాటింగ్ కు దిగిన యు పి వారియర్స్ మూడు వోవర్లలో రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. ఓపెనర్ల ఇద్దరినీ హీలే ఒకే ఓవర్ లో పెవిలియన్ కు పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement