Thursday, May 9, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ చిత్తు చిత్తు

ముంబై – మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 ప‌రుగుల తేడాతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును ఓడించింది . ముంబైలోని బ్ర‌బౌర్నే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో8 వికెట్ల న‌ష్టానికి 163 ర‌న్స్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగులు చేసింది.224 ల‌క్ష్య ఛేద‌న‌లో ఆ జ‌ట్టు ఆది నుంచి త‌డ‌బడింది. ఢిల్లీ బౌల‌ర్ తారా నోరిస్ ఐదు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ‌కొట్టింది. కీల‌క‌మైన హీథ‌ర్ నైట్ (34), ఎలిసే పెర్రీ (31) , దిశా క‌స‌త్‌(9), క‌నికా అహుజా (0), రీచా ఘోష్ (2)ల‌ను ఔట్ చేసింది. తారా నోరిస్ నాలుగు ఓవ‌ర్ల‌లో 29 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. డ‌బ్ల్యూపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి అసోసియేట్ ప్లేయ‌ర్ నోరిస్ రికార్డు సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement