Tuesday, April 30, 2024

ఆనందయ్య క్రెడిట్ కొట్టేయాలని చంద్రబాబు స్కెచ్: విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. నలుగురు వ్యక్తులు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్రదృష్టి అటు పడుతుందని విమర్శించారు. అందులోకి ఎలా దూరాలా? అని ఆలోచిస్తాడని అన్నారు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వస్తున్న క్రెడిట్ ఎలా కొట్టేయాలా అని గుంటనక్కలా స్కెచ్ వేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నదీనదాలు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి? అన్న శ్రీశ్రీ మాటలను టీడీపీ వారు మరోలా అర్థం చేసుకున్నారని విజయసాయి అన్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పచ్చజెండా పాతేశారు అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి… విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడిందన్నారు. చంద్రబాబు హయాంలో కార్పొరేట్ ఆస్పత్రులను పెంచి పోషించేందుకే పనికొచ్చిన ఆరోగ్యశ్రీని… ఈ రెండేళ్లలో సీఎం జగన్ గారు సంజీవనిగా మార్చారని విజయసాయిరెడ్డి కొనియాడారు. 95 శాతం మంది ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చారని… కరోనా, బ్లాక్ ఫంగస్‌లనే ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ జగన్ భరోసా కల్పించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement