Thursday, May 2, 2024

అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘అమరావతికి ఆ ఎత్తున మద్దతు ఉంటే ‘ఏసీ’ ధర్నా శిబిరంలో కూర్చున్న వారి బంధుమిత్రులున్న గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వన్‌సైడ్‌గా గెలిచి ఉండేవారు. రియల్ ఎస్టేట్ గోల తప్ప రాజధానికి ఈ ఉద్యమంతో ఏం సంబంధమని అక్కడి పౌరులు చెంప పగలగొట్టే తీర్పు చెప్పారు. రోజుల లెక్కకు తప్ప ధర్నా దేనికి’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. కాగా అమరావతిలో రైతులు ఉద్యమం చేపట్టి దాదాపు 600 రోజులు కావొస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement