Monday, April 29, 2024

జగన్ ఆస్తిలో సగం షర్మిలకు ఇవ్వాలి: వైసీపీ ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్‌ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. వైసీపీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని సూచించారు. వైసీపీ విజయంలో సగం పాత్రను పోషించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వడమే సముచిత న్యాయమన్నారు. వైసీపీ విజయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని చెప్పారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన అంబటి స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి అని అన్నారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని రఘురామ సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: వైసీపీ-బీజేపీ చీకటి ఒప్పందానికి విజయసాయిరెడ్డి నియామకమే నిదర్శనం: టీడీపీ

Advertisement

తాజా వార్తలు

Advertisement