Thursday, March 28, 2024

కేజిఎఫ్2 కు 255 కోట్ల భారీ ఆఫర్ ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతుంది. అలాగే శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ గా కనిపించనున్నారు.

ఇక ఈ టీజర్ కూడా సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఓ పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ డైరెక్టర్ ఓటీటీ లో విడుదల చేయడానికి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల ఆఫర్ ను ఇచ్చినట్లు సమాచారం. ఇండియన్ సినిమాలో అతిపెద్ద డీల్ ఇదేనట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయడానికే దర్శకుడు, యశ్ భావిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement