Monday, May 6, 2024

తెలంగాణ నేతలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ నేతలు వైఎస్ఆర్‌పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ దొంగ అయితే, జగన్ గజదొంగ అని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. తెలంగాణకు వైఎస్ఆర్ ఎంతో అన్యాయం చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వార్నింగ్ ఇచ్చారు.

వైఎస్ఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ నేతలకు మర్యాద ఉండదని రోజా అన్నారు. నదీ జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకోవడం తమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ నీటి వాటాను తమకు కేటాయించాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి షెకావత్ లకు ఇప్పటికే సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. శ్రీశైలం వద్ద ఏపీ వాటా నీటిని వాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేడయం కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమన్నారు. మహిళల భద్రత కోసం జగన్ దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చారని రోజా తెలిపారు. ఏనాడూ మహిళల భద్రతను పట్టించుకోని చంద్రబాబును టీడీపీ మహిళా నేతలు ప్రశ్నించలేదని… కానీ, ఎంతో చేస్తున్న జగన్‌ను విమర్శించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: జల వివాదాన్ని జగన్ ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించిన రఘురామ

Advertisement

తాజా వార్తలు

Advertisement