Sunday, April 28, 2024

మోహన్ బాబు నిర్మిస్తున్న ఆలయానికి వైసిపి ఎమ్మెల్యే విరాళం

శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు అధినేత, సినీ నటులు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థిక విరాళాన్ని అందజేశారు. గురువారం రంగంపేట సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేపడుతున్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని మోహన్ బాబుతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో మార్బల్ బండలు వేసేందుకు అవసరమైన రూ.17 లక్షల నిధులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహన్ బాబుకు అందజేశారు.

ఇంకా ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మోహన్ బాబు గారు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement