Sunday, May 19, 2024

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనాలు రద్దు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సర్కార్ నిర్ణయం లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సర్కారు నిర్ణయంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం పదిగంటల నుంచి ఈనెల 21 వరకు యాదాద్రిలో భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం పదిగంటల వరకు దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని అయితే స్వామి వారి నిత్య కైంకర్యాలను అంతరంగికంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement