Saturday, May 4, 2024

యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. గోవర్ధనగిరిధారిగా యాద్రాదీశుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. యాద్రాదీశుడి ద‌ర్శ‌నాకి భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వివిధ అలంక‌ర‌ణ‌లో స్వామి వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. వాహ‌న సేవ‌లో కొంద‌రు భ‌క్తులు పాల్గొంటున్నారు. ఆరో రోజైన నేడు గోవర్ధనగిరిధారి అలంకారంలో లక్ష్మీనారసింహుడు దర్శనమిచ్చారు. ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని చూసిన భక్తులు భక్తితన్మయంతో ఉప్పొంగిపోయారు. రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement