Sunday, April 28, 2024

Breaking : లారీ-కారు ఢీ.. ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో గుడుపల్లె మండలంలోని చిన్నశెట్టిపల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీని కారు ఢీకొట్ట‌డంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు వికాస్, కల్యాణ్, ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement