Saturday, April 27, 2024

WPL | అద‌ర‌కొట్టిన బౌల‌ర్లు.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా ఇవ్వాల జరిగిన రెండో ఎలిమినేటర్స్‌లో ఆర్సీబీ మహిళ​ల జట్టు విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి ముంబై ముందు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైన ఆర్సీబీ.. ఢిఫెండింగ్‌లో అదరకొట్టింది. దీంతో 136 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ.. మార్చి 17న జరగనున్న ఫైనల్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement