Friday, May 3, 2024

యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి, సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రోడ్ల పనులు నూతనంగా నిర్మించాల్సిన రోడ్లు, అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమకాలపై నియోజకవర్గ పరిధిలోని తహసిల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వెంటనే పూర్తి చేయాలని, సంక్షేమ ఫలాలను అందరికీ చేరేలా పనిచేయాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement