కామారెడ్డి, ప్రభన్యూస్ : కామారెడ్డి నరసన్నపల్లి బైపాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ చనిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ కి చెందిన కార్మికులను తీసుకెళ్తున్న యూపీకి చెందిన కారు జాతీయ రహదారిపై ఆర్టిఏ ఆఫీస్ సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు బోల్తా కొట్టడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన గాయత్రి దేవి (35) స్పాట్లో చనిపోయారని దేవునిపల్లి పోలీసులు తెలిపారు.
గాయపడిన రవి ప్రసాద్ యాదవ్ మరొక వ్యక్తిని వైద్య చికిత్స కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బైక్ పై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..