Friday, April 19, 2024

మంటల్లో కాలి బూడిదైన బైక్‌.. ఎందుకిలా జ‌రిగింద‌నే దానిపై ఆరా..

నవీపేట్ (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా నవీపేట దర్యాపూర్ కాలనీలో ఓ బైక్ మంట‌లంటుకుని ద‌గ్ధ‌మైంది. మహమ్మద్ సాజిత్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఇవ్వాల (ఆదివారం) మధ్యాహ్నం కాలిపోయింది. ముధోల్ వెళ్లి వచ్చి ఇంటి బయట త‌న బ‌జాబ్ ప్లాటినం బైక్ నిలిపి ఉంచాడు. ఇంట్లోకి వెళ్లి వచ్చిన తర్వాత పది నిమిషాలకు చూస్తే.. తన వాహనం మంటల్లో కాలిపోవ‌డం గ‌మ‌నించాడు. అయితే వాహనంలో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో కాలిపోయిందా.. ఎవ‌రైనా త‌గ‌ల‌బెట్టారా అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. అయితే బాధితుడు అనుమానంతో పోలీసుల‌కు కంప్లెయింట్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement