Wednesday, May 1, 2024

జింఖానా గ్రౌండ్స్ తొక్కిస‌లాట‌లో మ‌హిళ మృతి.. మ‌రికొంద‌రికి గాయాలు

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. దీనితో కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది. ఈ క్రమంలో టికెట్ల కోసం అభిమానుల మధ్య తోపులాట జరిగింది. అభిమానుల మధ్య జ‌రిగిన‌ తొక్కిసలాట, తోపులాటలో పోలీసులు కూడా కిందపడ్డారు. ఈ తొక్కిస‌లాట‌లో ఒక మ‌హిళ చ‌నిపోగా.. 20మందికి పైగా స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. వారిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement