వ్యవసాయ బావిలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన దూళి శ్రీను కసింకోట మండలానికి చెందిన దూళి చిన్నారితో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల దంపతులు అత్తవారింటి వద్ద గొడవపడ్డారు. అక్కడి నుంచి బయలుదేరిన వారు ఎలమంచిలి సమీపంలోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement