Tuesday, April 30, 2024

తెలంగాణలో మాస్క్ పెట్టుకోకపోతే జేబుకు చిల్లే

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు లేని వారికి పోలీసులు భారీ ఎత్తున జరిమానాలు వేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.1000 ఫైన్ వేస్తున్న పోలీసులు.. ఒకవేళ మాస్కులు లేని కస్టమర్లను షాపులోకి అనుమతిస్తే రూ.2000 జరిమానా విధిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్‌‌లు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement